Wednesday, December 10, 2014

పగలే వెన్నెల జగమే ఊయల



చిత్రం :-  పూజాఫలం 

గాయకులూ :-  యస్. జానకి


సంగీతం:-  సాలూరి రాజేశ్వరరావు


రచయిత:- డా.సి.నారయణ రెడ్డి



పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచె
నీటిలోన కలువభామ పొంగి పూచె..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసె
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల
Read more

సఖియా వివరించవే ...


ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ

సఖియా వివరించవే .....

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా

సఖియా వివరించవే .....

నిన్ను జూచి కనులు చెదరి .....
కన్నె మనసు కానుక జేసి .....
నిన్ను జూచి కనులు చెదరి
కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా వివరించవే .....

మల్లెపూలా మనసు దోచి

పిల్లగాలి వీచేవేళా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే .....

సినిమా : నర్తనశాల
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తిగారు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గారు
గానం : పి.సుశీల
Read more

హాస్యనట చక్రవర్తి "రాజబాబు"

Rajababu

తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్‌ రాజబాబు.
మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ హాస్యం ఏ మాత్రం పట్టుతప్పినా అపహాస్యం పాలవుతుంది. అటువంటి హాస్యాన్ని తమ నటన, వాచకంతో మెప్పించిన కస్తూరి శివరావు, చదల వాడ, నల్లరామ్మూర్తి, రమణారెడ్డి, రేలంగి, వంగర, శివరామ కృష్ణయ్య, తదితరులు ఒక ప్రత్యేకమైన నటనతో, హాస్యంతో ఆనాటి ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఆయా సన్నివేశాలను చూసినప్పుడు నవ్వని నేటి ప్రేక్షకులు కూడా ఉండరు. వారితో పాటు నటించి నేటి తరం ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన 'హాస్యనటచక్రవర్తి', మంచి మనిషి రాజబాబు.
హాస్యనటులు తమలో ఎంత బాధ ఉన్నా తెరపై చూసేవారికి నవ్వులు పూయించాలి. ఈ అనుభవం ఒకప్పటి ఎందరో హాస్యనటులకు అనుభవమే. అందుకే అన్నారేమో ఆత్రేయ 'నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి' అని. అలా కొన్ని సినిమాల్లో నవ్వించినా, మరికొన్ని సినిమాల్లో ఏడిపించినా అది ఆ హాస్యనటచక్రవర్తికే చెల్లింది. అంతేకాదు డైలాగ్‌ డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, నేటి ప్రేక్షకులు బ్రేక్‌, షేక్‌ అని చెప్పుకునే డ్యాన్స్‌లను ఆనాడే చేసి హాస్యనటుల్లో అద్భుతమైన డ్యాన్సర్‌గా చెప్పదగ్గ హాస్యనటుడు రాజబాబు.
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1938 సంవత్సరం అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించారు. ఈయనతోపాటు ఇప్పటి సినిమాల్లో నటిస్తున్న చిట్టిబాబు, అనంత్‌లు ఆయన తమ్ముళ్ళే. వీరు కూడా తెలుగులో మంచి హాస్యాన్ని అందించే హాస్యనటులుగా పేరుపొందారు.
ఇంటర్మీడియట్‌తో పాటు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సును పూర్తిచేసిన రాజబాబు కొంతకాలం పాటు టీచర్‌గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుండి వున్న నటనాభిలాషతో రంగస్థలంపై 'కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళచావడి' వంటి నాటకాల్లో సైతం నటించి రంగస్థలంపై మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నారు.  ఒకసారి ఈయన రంగస్థలంపై వేసిన నాటకం చూసిన అప్పటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావుగారు ప్రోత్సహించటంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళారు.
ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.  అంతేకాదు హాస్యనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారని, ప్రతి ప్రముఖహీరో చిత్రంలోనూ తప్పనిసరిగా ఈయనకు ఓ పాత్ర ఉండేలా దర్శకులు, నిర్మాతలు చూసేవారని అంతగా ఆయన జనాభిమానం పొందారని ఆనాటి సినీఅభిమానుల మాట. అలా 20యేళ్ళపైబడి ఈయన సినీజీవితంలో 590కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబునే  నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు.
తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు, మంచిమనిషి, అంతస్తులు, భీష్మ, పరువుప్రతిష్ట, నవరాత్రి, పరమానందయ్యశిష్యులకథ, ఉమ్మడికుటుంబం, విచిత్రకుటుంబం, గూఢచారి 116, సాక్షి, బంగారుపిచ్చిక, రణభేరి, కథానాయకుడు, కోడలు దిద్దినకాపురం, అందాలరాముడు, మహాకవి క్షేత్రయ్య, అల్లూరి సీతారామరాజు, బుజ్జిబాబు, గడసరి అత్త సొగసరి కోడలు ఇలా ఎన్నో చిత్రాల్లో తన నవ్వులను పూయించారు.
కేవలం హాస్యనటునిగానే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి యస్వీరంగారావు, అంజలిదేవి వంటి మహా మహులు నటించిన 'తాతా మనవడు' చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా ఆయన కేవలం హాస్యనటునిగానే కాకుండా సీరియస్‌, ఉదాత్తమైన పాత్రలు కూడా చేయగలరని నిరూపించింది ఆ చిత్ర ఘనవిజయం. పిచ్చోడిపెళ్ళి, తిరుపతి, ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. ఈయనకు సినిమాల్లో జోడిగా లీలారాణి, మీనా కుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమా ప్రభ వంటి వారు నటించినా రాజబాబు- రమాప్రభల జంట హిట్‌ఫెయిర్‌గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. నటనే కాకుండా గాయకు నిగా కూడా ఈయన అరుదుగా తన గళం వినిపించారు. ఈ పాట ప్రేక్షకులు అభిమానించే హాస్య పాటల్లో ప్రముఖమైన పాటగా నేటికీ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది అది ఇల్లు-ఇల్లాలు చిత్రంలో 'వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను' అంటూ సాగే పాటలో రాజబాబు గాత్రం వినిపించి ఆ పాటకు సరికొత్త అందాన్ని, ఆ చిత్ర విజయానికి దోహదం చేసిందంటే అతిశయోక్తికాదు.
అలాగే నటీనటుల  సరసనకు వస్తే ఎన్‌.టి.ఆర్‌.తో కథానాయకుడు, బడిపంతులు, అడవిరాముడు వంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. అలాగే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, తదితర నటులతో ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్‌, ఇల్లు-ఇల్లాలు,గూఢచారి 116, జీవనజ్యోతి, సొగ్గాడు వంటి చిత్రాలు ఉదాహరణలు మాత్రమే.
నటునిగానే కాకుండా నిర్మాతగా "బాబ్‌ అండ్‌ బాబ్‌ ప్రొడక్షన్" పై ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డునపడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నటించారు.
నటనలోనే కాదు వ్యక్తిత్వం లోను ఎంతో గొప్ప వాడని పించుకున్న  హాస్యరస చక్రవర్తి ఆయన. రాజబాబు కెరియర్ ని పరిశీలిస్తే, మంచితనానికీ ... మానవత్వానికి ఆయన ప్రతీకలా కనిపించే సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకసారి ఓ చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది.
అవి 'భలేకాపురం' (1980) సినిమా షూటింగ్ జరుగుతోన్న రోజులు. ఆ సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు. ఇక 'భలే కాపురం' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని చెన్నైలోని వాహినీ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు - రమాప్రభలపై కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీక రించవలసి ఉంది. అయితే, అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు, ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
       
  ఆ పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చక చకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో కప్పిపెడుతోన్న రాజబాబుని చూసి ఆయన షాక్ అయ్యారు. ''ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా'' అని గోపాలకృష్ణ కంగారుగా అన్నారు.
      
"నేను ఎంతో మందికి ఎన్నో చేశాను ... మీకు మాత్రం ఏమీ చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చేశాను'' అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడు, వెంటనే ఆయన సీన్స్ ని చక చకా తీసేసి పంపించారట. దాంతో రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ ఎరుగనట్టు బెడ్ పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు.  

సినిమాల్లో ప్రేక్షకులను మనసారా నవ్వించే రాజబాబు నిజజీవితంలో వేదాంతి, తాత్విక స్వభావం కలవారు. గతాన్ని మరచిపోకూడదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే జీవితానికి దారిచూపిస్తాయని రాజబాబు అభిప్రాయం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పాతతరం నటీనటులను, ముఖ్యంగా హాస్యనటులను సన్మానించేవారు.

రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దానధర్మాలు చేసాడు.  తన కష్టకాలంలో ఒక పాక  హోటల్లోని స్త్రీ పెట్టిన  టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు.   ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.  మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ సమయంలో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. కోరుకొండలో జూనియర్‌ కాలేజీని కట్టించారు., రాజమండ్రిలో పేదలకు ఇంటిస్థలం ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి. హాస్యం బ్రతికున్నం తకాలం ఆయన ప్రేక్షకుల మదిలో సదా చిరంజీవే.
అవార్డుల విషయానికొస్తే వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డును పొందిన మొదటి హాస్యనటుడు రాజబాబే. తన నట జీవితంలో 9 ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు నంది అవార్డులు ఇలా ఇంకా ఎన్నో సేవా సంస్థలు, ఇతరసంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. శతాబ్దపు హాస్యనటునిగా కీర్తించ బడ్డ ఈయన్ను 'హాస్యనట చక్రవర్తి'గా పిలుచుకునేవారు.
1965లో వివాహమైన రాజబాబుకు ఇద్దరు పిల్లలు. రాజబాబు భార్య లక్ష్మి అమ్ములు, మహాకవి శ్రీశ్రీ మరదలు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. తమ్ముళ్లు చిట్టిబాబు, అనంత్ హాస్యనటులుగా కొనసాగుతున్నారు.
అనుకరణకు అందని నటుడు రాజబాబు. వాచకంలోకాని, అభినయంలోకాని ఆయన శైలి ఎవరికి రాదు. అటువంటి గొప్ప హాస్యనటుడు, మంచి మనిషి 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న  స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో ఓ మంచి హాస్యం కనుమరుగైపోయింది.
http://www.telugubidda.in సౌజన్యంతో....
Read more

"సూర్యకాంతం" గయ్యాళే... అయినా అందరి మనసు దోచుకుంది

suryakantam actressసూర్యకాంతం... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు. సూర్యకాంతం పేరు వింటేనే కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా, అమె `గయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"
 ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సివస్తే, కత్తులు, తుపాకులు అవసరంలేని మాటల తూటాలతో పాత్రకున్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఎవరినా, “ధధిగిణ ధోం” అని ఆమె ధోరణులకు వంతు పాడవలసినదే. ఏ దర్శకుడు, నిర్మాత అయినా సరే, సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసినదే. మాటలు సూదుల్లా గుచ్చుకునేలా వున్నా, మనసులోమాత్రం వాటికి వెన్న, తేనె పూసింది అన్నది కొందరికే తెలిసిన విషయం. అందం అంటే కేవలం భౌతికం కాదు, మనసు, మాట, హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్నిబట్టి అందాన్ని అంచనా వేయాలి అంటే, సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రధమంగా చెప్పాలి. దరికిరానీయని గర్వం, అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్ధం చేసుకుని నటించగలిగే సామర్ధ్యంగల తారాకాంతం, సూర్యకాంతం.

బాల్యం:
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.
సినీ జీవితం:
మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
అవి దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన రోజులు. దాసరి రాసిన ఒక డైలాగ్ సూర్యాకాంతంకు నచ్చలేదు. ఆ డైలాగ్ మార్చమని సూర్యాకాంతం అడిగితే దాసరి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అదే డైలాగ్ ను చెప్పి షాట్ ఒకే చేశారు. అయితే, ఈ సంఘటనతో దాసరి బాధపడ్డారు.  కాగా, తరువాత మరో షూటింగ్ లో పాల్గొన్న సూర్యాకాంతం అక్కడ కూడా డైలాగ్ మార్చమనిఅడిగారు. వెంటనే ఆ రైటర్ ‘సరే’ అన్నాడు. దానికి సూర్యాకాంతం ’నువ్వేం. రైటర్ వయ్యా.. ఏది మార్చమంటే అది మారుస్తానంటున్నావు.. నవ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం లేదా.. దాసరి చూసి నేర్చుకో‘ అని మందలించారు. ఈ సంగతి తెలిసిన దాసరి ఎంతగానో సంతోషించారు.
 “పాత్ర తిట్టిందమ్మా! నువ్వు ఎందుకు బాధపడతావు” అని ఓ పాత్రద్వారా నాగయ్య పాత్రను తిట్టినందుకు అపరాధం క్షమించండీ అని ఆయన కాళ్ళమీద పడి మన్నించండి అని వేడుకోవడం లోనే, ఎప్పుడూ నాన్నగారూ అని నాగయ్యను పిలిచే, ఆమె మనసుచల్లదనం బయటపడుతుంది.
అత్తగారుగా వెలిగిన ఆమెను, అక్కగారు, దొడ్డమ్మగారు, పెద్దవారు “కాంతమ్మా౧” అని పిలవడంపట్ల సూర్యకాంతం అందరి వయసువారికి దగ్గరిబంధువు.
న్యాయంగా ఆమె వేసే పాత్రల్ని బట్టి “అత్తగారూ” అని పిలవడం ధర్మం; “ఆమ్మో! బయటకూడా అలా పిలిస్తే ఈ కోడళ్ళం బతికినట్లే! – అని మహానటి సావిత్రి చమత్కారవ్యాఖ్యానం.
ఓసారి 'శ్రీమంతుడు' సినిమా షూటింగులో జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం తాను చెప్పవలసిన డైలాగులు అయిపోయినప్పటికీ ఆమె ఇంకా ఏవో డైలాగులు చెబుతూనే ఉందట. దర్శకుడు ప్రత్యగాత్మ కట్ చెప్పకుండా అలానే చూస్తుండిపోవడంతో, ''అదేంటి నాయనా... నా మటుకు నేను ఏదో చెప్పుకుపోతుంటే కట్ చెప్పడంలేదు'' అన్నారు. ''మీరు అదనంగా చెబుతోన్న డైలాగులు బాగానే ఉన్నాయి కదా... అని ఊరుకున్నాను'' అన్నారాయన. ''అలాగా ... అయితే అదనంగా చెప్పిన డైలాగులకి కాస్త అదనంగా ఏదైనా ఇప్పించు నాయనా'' అంటూ ఆమె అందర్నీ నవ్వించారు. 
నటనా శైలి :
సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటుల పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
వ్యక్తిత్వం:
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!
షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్య ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.
మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
చివరిగా సూర్యకాంతం నిర్వచనం:
నటనద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసరిన సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లికబుర్లు చోటుచేసుకున్నా, ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం – వెరసి పెద్దిభొట్ల సూర్యకాంతం. గయ్యాళి అత్తకు మరోపేరు. మనసున్న అమ్మకు సమానార్ధ్ం. అందుకే – తెరపైన “అత్త”, తెరవెనుక “అమ్మ” అన్న నిర్వచనం సరిసములులేని భావన. చిత్రాల్లో సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు, సహనటీనటులకు యింటినుంచి షడ్రసోపేతమైన ఆహారభోజనాల్ని తెచ్చిపెట్టడం, ఆ రుచులతో గయ్యాళితనాన్ని మరచిపోయి, మనసున్న మహామనీషిగా గుర్తింపు అలవోకగా తెచ్చుకుంది. పులిలా కనిపించే ఈమె హస్తవాసితనం పులిహోర తయారీలో సిద్ధహస్తురాలు, గోలచేయని గోంగూరపచ్చడి, మాయామర్మంలేని ఆవకాయ, అధ్బుతాల్ని అందించే అల్లంపచ్చడి, కన్నులవిందైన కందిపొడితోపాటు బిగుతైన డబ్బాతో ఘుమఘుమలాడే నేతిసరుకుని కూడ యింటినుంచి దిగుమతిచేసుకునివచ్చి, వివాహభోజనసమానమైన బలేపసందుల విందును అనుభవించేవారు
“సూర్యకాంతం” వ్యక్తిత్వం, నటన, ఈ ధరణిపై సూర్యకాంతి, చంద్రునిచల్లదనం ఉన్నంతవరకూ, సూర్యకాంతమ్మ సూరజముఖిలా వికసిస్తూ, నిత్యం కాంతినిస్తూ తెలుగుప్రజను నిండుగా అలరిస్తూనే వుంటుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, విడ్డూరం లేని పరమసత్యాలు.
నటించిన సినిమాలు:
    ధర్మాంగద (1949)
    సంసారం (1950)
    పెళ్ళిచేసి చూడు (1952)
    బ్రతుకుతెరువు (1953)
    కన్యాశుల్కం (1955) (మీనాక్షి)
    దొంగరాముడు (1955)
    చరణదాసి (1956)
    శ్రీ గౌరీ మహత్యం (1956)
    భాగ్యరేఖ (1957)
    మాయాబజార్ (1957)
    తోడికోడళ్ళు (1957)
    దొంగల్లో దొర (1957)
    అప్పుచేసి పప్పుకూడు (1959)
    మాంగల్యబలం (1959)
    కృష్ణలీలలు (1959)
    భాగ్యదేవత (1959)
    జయభేరి (1959)
    శాంతినివాసం (1960)
    ఇద్దరు మిత్రులు (1961)
    పెళ్లికాని పిల్లలు (1961)
    భార్యా భర్తలు (1961)
    వాగ్దానం (1961)
    వెలుగునీడలు (1961)
    శభాష్ రాజా (1961
    కలసి ఉంటే కలదు సుఖం (1961)
    మంచిమనసులు (1962)
    రక్తసంబంధం (1962)
    సిరిసంపదలు (1962)
    గుండమ్మకథ (1962)
    తిరుపతమ్మకథ (1963)
    నర్తనశాల (1963) (అథిది పాత్ర)
    పరువు ప్రతిష్ఠ (1963
    చదువుకున్న అమ్మాయిలు (1963
    మురళీకృష్ణ (1964)
    మూగమనసులు (1964)
    డాక్టర్ చక్రవర్తి (1964)
    ఉయ్యాల జంపాల (1965)
    నవరాత్రి (1966)
    సంగీతలక్ష్మి (1966)
    ఆస్తిపరులు (1966)
    కన్నెమనసులు (1966)
    బ్రహ్మచారి (1967)
    సుఖ దు:ఖాలు (1967)
    ఉమ్మడికుటుంబం (1967)
    అత్తగారు-కొత్తకోడలు (1968)
    బుద్ధిమంతుడు (1969)
    ఆత్మీయులు (1969)
    బాలరాజు కథ (1970)
    దసరాబుల్లోడు (1971)
    అమాయకురాలు (1971)
    కాలం మారింది (1972)
    కొడుకు కోడలు (1972)
    అందాల రాముడు (1973)
    ముత్యాల ముగ్గు (1975)
    సెక్రటరి (1976)
    గోరంతదీపం (1978)
    రాధాకృష్ణ (1978)
    కార్తీక దీపం (1979) (శారదా తల్లి)
    వియ్యాలవారి కయ్యాలు (1979)
    చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
    పెళ్ళిచూపులు (1983
    బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989)
    వన్ బయ్ టూ (1993)

మూలం / సేకరణ: wikipedia
http://www.telugubidda.in సౌజన్యంతో....
Read more

Wednesday, December 3, 2014

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల

చిత్రం : తోడికోడళ్లు (1957)
రచన : ఆత్రేయ
దర్శకులు : ఆదుర్తి సుబ్బారావు 

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

నోట్ : ఈ పాట శరత్  బెంగాలి నవల “నిష్కృతి” ఆధారంగా  దుక్కిపాటి మధుసూదన రావు నిర్మించిన “తోడికోడళ్లు” సినిమా లోనిది.
Read more

నేనొక ప్రేమ పిపాసిని -

చిత్రం : ఇంద్రధనుస్సు (1978)
గానం : బాలసుబ్రహ్మణ్యం

నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 1:
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని..

చరణం 3:
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..
Read more